Airtel: కోట్లాది మంది మొబైల్ యూజర్లకు ఎయిర్‎టెల్ వార్నింగ్.. వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిక

Airtel: కోట్లాది మంది మొబైల్ యూజర్లకు ఎయిర్ టెల్( Airtel) వార్నింగ్ ఇచ్చింది.

Update: 2025-01-19 11:40 GMT
Airtel:  కోట్లాది మంది మొబైల్ యూజర్లకు ఎయిర్‎టెల్ వార్నింగ్.. వాటికి దూరంగా ఉండాలని హెచ్చరిక
  • whatsapp icon

  దిశ, వెబ్ డెస్క్: Airtel: కోట్లాది మంది మొబైల్ యూజర్లకు ఎయిర్ టెల్( Airtel) వార్నింగ్ ఇచ్చింది. పెరుగుతున్న ఆన్ లైన్ మోసాలపై అలర్ట్ జారీ చేసింది. దేశంలోని రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన ఎయిర్ టెల్( Airtel) తెలియని నెంబర్ల నుంచి కాల్స్, మెసేజ్ లను నివారించాలని వినియోగదారులను కోరింది. ఎస్ఎంఎస్(SMS) ద్వారా మోసాలకు దూరంగా ఉండాలని టెలికాం కంపెనీ యూజర్లను కోరింది. ఇటీవల టెలికమ్యూనికేషన్స్ శాఖ(Department of Telecommunications) ఆన్ లైన్ మోసాలను నిరోధించేందుకు టెలికాం కంపెనీలకు మార్గదర్శకాలను జారీ చేసింది. అలాగే మెసేజ్ ట్రాకింగ్(Message tracking) తో పాటు అనేక కొత్త నియమాలను అమలు చేస్తోంది.

కేవైసీ(KYC) అప్ డేట్, యూజర్ ఐడి, పాస్ వర్డ్, డెబిట్ కార్డ్ నెంబర్, పిన్(PIN), సీవీవీ(CVV) లేదా ఓటీపీ(OTP) మొదలైన వాటికి సంబంధించి ఏవైనా కాల్స్ , మెసేజ్ లు లేదా ఇమెయిల్ వస్తే లింక్ ను ఓపెన్ చేయకూడదని ఎయిర్ టెల్( Airtel) తన యూజర్లకు మెసేజ్ ల ద్వారా హెచ్చరికలు జారీ చేసింది. వీరు సైబర్ నేరగాళ్లు కావచ్చని..వీరితో తెలిసి లేదా తెలియక మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసుకుంటే భారీ మోసానికి దారి తీస్తుందని తెలిపింది.

అయితే ఈ మధ్య కాలంలో ఆన్ లైన్ మోసాల(Online fraud)కు సంబంధించి ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో హ్యాకర్లు వ్యక్తుల నుంచి సమాచారం అందుకున్న తర్వాత వారి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఎయిర్ టెల్ తోపాటు, ఆర్బిఐ, ఎస్బిఐ కూడా బ్యాంకింగ్, యూపిఐ మోసాలకు సంబంధించి యూజర్లను హెచ్చరించాయి. ఈ రకమైన మోసాన్ని హ్యాకర్లు సోషల్ ఇంజనీరింగ్ ద్వారా వ్యక్తులను ట్రాప్ చేస్తారు. వారి పర్సనల్ డీటెయిల్స్ పొందేందుకు వారిని ట్రాప్ చేస్తుంటారు.

ఆర్థిక మోసాలకు గురికాకుండా ఎలా నివారించాలి?

ఎలాంటి ఆర్థిక మోసాలకు గురికాకుండా ఉండేందుకు జాగ్రత్తలే గొప్ప ఆయుధం. మీకు అలాంటి మెసేజ్ లు లేదా కాల్స్ వచ్చినట్లయితే వాటిని డిలీట్ చేయడం మంచిది. ఫ్రీ గిఫ్ట్స్, లేదా రివార్డ్ పేరుతో సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని ట్రాప్ చేసే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీకు ఏదైనా గిఫ్టు లేదా లాటరీకి సంబంధించిన కాల్స్ వస్తే దానికి మీరు రెస్పాండ్ కాకూడదు. చాలా మంది సైబర్ నేరగాళ్ల నుంచి టెంప్టింగ్ ఆఫర్స్ ఉచ్చులో పడి తమ బ్యాంకింగ్ వివరాలను షేర్ చేసుకుంటారు. ఇలా చేస్తే మీరు మోసపోతారు.

ఆర్బిఐ ప్రకారం ఏ బ్యాంకు లేదా ఏజెన్సీ మిమ్మల్ని ఓటీపీ లేదా పిన్ లేదా మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎట్టిపరిస్థితుల్లోనూ అడగదు. మీకు అలాంటి కాల్ ఏదైనా వచ్చినట్లయితే అది సైబర్ నేరస్థుడి నుంచి కావచ్చని గ్రహించాలి. మీరు సైబర్ మోసానికి గురైనట్లయితే..ముందగా వెంటనే ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైమ్ పోర్టల్ లో ఫిర్యాదు చేసిన తర్వాత కూడా 99శాతం కేసుల్లో డబ్బు తిరిగి వస్తాయి. మీరు స్కామ్ జరిగిన అరగంట లేదా 1గంటలోపు రిపోర్ట్ చేస్తే మీ డబ్బు తిరిగి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. దీనికోసం 1930 సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ కు కాల్ చేయవచ్చు. లేదంటే cybercrime.gov.in పోర్టల్లో కంప్లెయింట్ చేయవచ్చు.

Tags:    

Similar News