Vinesh Phogat: నేడు తేలనున్న రెజ్లర్ వినేశ్ ఫొగట్ భవితవ్యం.. తీర్పును వెల్లడించనున్న CAS

ఒలింపిక్స్ సెమీస్ నుంచి అనర్హురాలిగా వైదొలిగిన రెజ్లర్ వినేశ్ ఫొగట్ భవితవ్యం నేడు తేలనుంది.

Update: 2024-08-13 08:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఒలింపిక్స్ సెమీస్ నుంచి అనర్హురాలిగా వైదొలిగిన రెజ్లర్ వినేశ్ ఫొగట్ భవితవ్యం నేడు తేలనుంది. ఉండాల్సిన బరువు కంటే 100 గ్రా. బరువు ఎక్కువగా ఉండటంతో ఆమెపై అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో తనకు రజత పతకం ఇవ్వాలంటూ వినేశ్ కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్‌ (CAS)‌ను ఆశ్రయించింది. ఈ మేరకు సెమీ ఫైనల్ రోజు ఉండాల్సిన బరువే ఉన్నానని ఆమె తన పిటిషన్‌‌లో కోర్టుకు విన్నవించారు. అయితే, ఆమె ప్రతిపాదనను యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో CAS ఎలాంటి తీర్పును వెలువరిస్తుందనే అంశంపై దేశ వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. 

Tags:    

Similar News