టైటిల్ పోరులో భారత్ బోల్తా.. ఇంటర్కాంటినెంటల్ కప్ సిరియాదే
ఇంటర్కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నీ టైటిల్ను భారత్ కాపాడులేకపోయింది.
దిశ, స్పోర్ట్స్ : ఇంటర్కాంటినెంటల్ కప్ ఫుట్బాల్ టోర్నీ టైటిల్ను భారత్ కాపాడులేకపోయింది. టైటిల్ పోరులో భారత ఫుట్బాల్ జట్టు తేలిపోయింది. సిరియా కప్ను ఎగరేసుకపోయింది. టోర్నీలో భాగంగా హైదరాబాద్లో సోమవారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్పై 3-0 తేడాతో సిరియా విజయం సాధించింది. భారత్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. ఐదుసార్లు ప్రత్యర్థి గోల్పోస్టు దగ్గరికి దూసుకెళ్లినా గోల్ దక్కలేదు. మరోవైపు, సిరియా ఆటగాళ్లు మొదటి నుంచి దూకుడుగా ఆడారు. సిరియా తరపున 7వ నిమిషంలో మహమూద్ అల్ అస్వాద్, 76వ నిమిషంలో దలేహో మోహ్సెన్, 96వ నిమిషంలో పాబ్లో సబ్బాగ్ గోల్ చేశారు. విజయం లేకుండానే భారత జట్టు టోర్నీని ముగించడం గమనార్హం. తొలి మ్యాచ్లో మారిషన్తో 0-0తో డ్రా చేసుకుంది. కాగా, 2018, 2023 ఎడిషన్లలో భారత్ విజేతగా నిలిచింది.