Asian Games 2023: క్వార్టర్స్‌లో అడుగుపెట్టిన భారత టెన్నిస్ ప్లేయర్స్..

Update: 2023-09-26 13:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: భార‌త టెన్నిస్ ప్లేయ‌ర్లు ఆసియా గేమ్స్‌లో అదరగోడుతున్నారు. టాప్ సీడ్ సుమిత్ న‌గ‌ల్, అంకిత్ రైనా క్వార్టర్స్‌లో అడుగు పెట్టారు. దీంతో ప‌త‌కానికి అడుగు దూరంలో నిలిచారు. పురుషుల సింగిల్స్‌లో సుమిత్ త‌న పదునైన ఏస్‌ల‌తో క‌జ‌కిస్థాన్ ఆట‌గాడు బీబిత్ ఝుక‌యేవ్‌ను ఓడించాడు. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన సుమిత్ 7-6, 6-4తో సునాయ‌సంగా గెలిచాడు. భార‌త సంచ‌ల‌నం అంకిత్ రైనా మ‌హిళ‌ల సింగిల్స్‌లో స‌త్తా చాటింది. ఈ రోజు జ‌రిగిన ప్రీ క్వార్టర్స్‌లో ఆమె హాంకాంగ్‌కు చెందిన‌ ఆదిత్య క‌రుణ‌ర‌త్నేను 6-1, 6-2తో చిత్తుగా ఓడించింది. సెమీఫైన‌ల్ పోరులో అంకిత్ జ‌పాన్ ప్లేయ‌ర్ హ‌రుక క‌జీతో త‌ల‌ప‌డ‌నుంది.


Similar News