టీమ్ ఇండియాకు మరో షాక్.. టీ20లకు రోహిత్ దూరం..?

బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేలో తీవ్ర గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టు సిరీస్ దూరమైన సంగతి తెలిసిందే. కాగా అతని గాయం మానకపోవడం తో వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా రోహిత్ శర్మ దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

Update: 2022-12-25 02:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ తో జరిగిన వన్డేలో తీవ్ర గాయం కారణంగా రోహిత్ శర్మ టెస్టు సిరీస్ దూరమైన సంగతి తెలిసిందే. కాగా అతని గాయం మానకపోవడం తో వచ్చే నెలలో శ్రీలంకతో జరగనున్న టీ20 సిరీస్‌కు కూడా రోహిత్ శర్మ దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. రోహిత్ శర్మ ఎడమ చేతి బొటనవెలుకు తీవ్ర గాయం కారణంగా అతనికి విశ్రాంతి ఇచ్చారు. కాగా ఆ గాయం తీవ్రత ఎక్కువగా ఉండటం.. వచ్చేనెల వరకు మానకపోతుండోచ్చని బీసీసీఐ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ క్రమంలో రోహిత్ ను శ్రీలంక సిరీస్ కు దూరంగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా శ్రీలంక పర్యటనకు కేవలం టీ20 స్పెషలిస్టులే కెప్టెన్సీ చేస్తారని తెలుస్తుంది. అలాగే లంక టీ20 కి సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం.

Also Read..

2022 కోహ్లీకి కఠినమైన సంవత్సరం: దినేష్ కార్తీక్


Similar News