దిశ, వెబ్డెస్క్: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. పేస్ బౌలర్ బుమ్రా రీ ఎంట్రీపై స్పందించాడు. ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత్.. గురువారం నుంచి వన్డే మ్యాచ్లు ఆడనుంది. ఈ సందర్భంగా మొదటి మ్యాచ్కు ముందు ప్రెస్మీట్లో పాల్గొన్న రోహిత్ను బుమ్రా రీ ఎంట్రీ గురించి ఓ విలేకరి అడగ్గా.. అతడు కీలక వ్యాఖ్యలు చేశాడు. "టీమ్ఇండియాలో బుమ్రా అనుభవజ్ఞుడైన బౌలర్. అతడు జట్టుకు చాలా కీలకం. ప్రస్తుతం అతడు తీవ్ర గాయం నుంచి కోలుకుంటున్నాడు. కానీ ఐర్లాండ్ పర్యటనకు ఇంకా జట్టును ప్రకటించలేదు.
అతడు ఆ సిరీస్లో అడతాడో లేదో నాకు తెలియదు. కానీ అతడు ఆడితే మంచిదే. ఎందుకంటే చాలా కాలం విశ్రాంతి తర్వాత ఏ ఆటగాడైనా.. తొందరగా పాత ఫామ్ను అందుకోలేడు. అందుకే బుమ్రా వరల్డ్ కప్కంటే ముందే జట్టులోకి రీఎంట్రీ ఇస్తాడని అనుకుంటున్నా. కానీ అదంతా అతడు కోలుకునే స్పీడ్పైనే ఉంటుంది. మేము ఎప్పటికప్పుడు ఎన్సీఏతో మాట్లాడుతున్నాం. ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయి" అని రోహిత్ శర్మ అన్నాడు.