Mohammed Siraj: టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బ.. విండీస్తో వన్డే సిరీస్కు కీలక పేసర్ ఔట్
టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కాలికి గాయమైంది.
పోర్ట్ ఆఫ్ స్పెయిన్ : టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ కాలికి గాయమైంది. దాంతో విండీస్తో వన్డే సిరీస్కు అతను దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ బుధవారం వెల్లడించింది. ‘విండీస్తో మూడు వన్డేల సిరీస్ నుంచి సిరాజ్ రిలీజ్ అయ్యాడు. అతను చీలమండల గాయంతో బాధపడుతున్నాడు. ముందు జాగ్రత్త చర్యగా బీసీసీఐ మెడికల్ టీమ్ అతనికి విశ్రాంతిని సూచించింది. సిరాజ్ స్థానంలో మరో ప్లేయర్ను భర్తీ చేయడం లేదు.’ అని బోర్డు తెలిపింది.
విండీస్తో టీ20 సిరీస్కు ప్రకటించిన జట్టులో సిరాజ్కు చోటు దక్కలేదు. దాంతో సిరాజ్ ఇంటికి పయనం కానున్నాడు. టెస్టు సభ్యులు అశ్విన్, కేఎస్ భరత్, నవ్దీప్ సైనీ, అజింక్యా రహానేలతో కలిసి అతను భారత్కు రానున్నాడు. బౌలింగ్ దళంలో కీలక బౌలర్గా ఉన్న సిరాజ్ దూరమవడం టీమ్ ఇండియాకు ఎదురుదెబ్బే. విండీస్తో రెండో టెస్టులో సిరాజ్ ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.