ఐసీసీ చైర్మన్‌గా జై షా.. యంగెస్ట్ చైర్మన్‌గా రికార్డు

అనుకున్నదే జరిగింది. బీసీసీఐ సెక్రెటరీ జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు.

Update: 2024-08-27 15:00 GMT

దిశ, స్పోర్ట్స్ : అనుకున్నదే జరిగింది. బీసీసీఐ సెక్రెటరీ జై షా ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం ధ్రువీకరించింది. చైర్మన్ పదవికి నామినేషన్ వేయడానికి మంగళవారమే చివరి రోజు కాగా.. జై షా మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఇంకెవరు పోటీలో లేకపోవడంతో జై షా ఎన్నిక ఏకగ్రీవమైంది. డిసెంబర్ 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. 35 ఏళ్ల జై షా యంగెస్ట్ ఐసీసీ చైర్మన్‌గా రికార్డు నెలకొల్పారు. అంతేకాకుండా, జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, ఎన్‌.శ్రీనివాస్, శశాంక్ మనోహర్ తర్వాత ఐసీసీ చైర్మన్‌గా ఎన్నికైన 5వ భారతీయుడిగా జై షా నిలిచారు

Tags:    

Similar News