India vs West Indies ODI: చరిత్ర సృష్టించిన జడేజా-కుల్‌దీప్ జోడి.. వన్డేల్లో తొలిసారిగా..

వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత స్పిన్‌ జోడి కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేసి అరుదైన ఘనత సాధించారు.

Update: 2023-07-28 10:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత స్పిన్‌ జోడి కుల్‌దీప్‌ యాదవ్, రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శన చేసి అరుదైన ఘనత సాధించారు. దీంతో కేవలం 23 ఓవర్లోనే వెస్టిండీస్​ చేతులెత్తేసింది. జడేజా 6 ఓవర్లు వేసి 37 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. కుల్దీప్‌ 3 ఓవర్లలో కేవలం ఆరు పరుగులు ఇచ్చి.. 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఈ స్పిన్నర్లు అరుదైన ఘనత సాధించారు. ఇలా టీమ్​ఇండియా తరఫున ఒక వన్డే మ్యాచ్‌లో 7 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన బౌలర్లుగా నిలిచారు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విట్టర్​ వేదికగా ప్రకటించింది.

ఈ మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. విండీస్ నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను 5 వికెట్లు కోల్పోయి 22.5 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ 52 పరుగులతో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనర్‌గా కాకుండా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగడం విశేషం. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.


Similar News