IND vs SL T20 : టీమిండియాకు వరుసగా రెండో విజయం.. శ్రీలంకపై టీ20 సిరీస్ కైవసం

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది.

Update: 2024-07-28 18:10 GMT

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను దక్కించుకుంది. ఆదివారం పల్లెకెలె వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో టీమిండియా డీఎల్ఎస్ పద్ధతిలో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లలో 161/9 స్కోరు చేసింది. కుసాల్ పెరీరా(53) హాఫ్ సెంచరీతో రాణించాడు. నిశాంక(32), కామిందు మెండిస్(26) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్ 3 వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్, అక్షర్, పాండ్యాలకు చెరో రెండు వికెట్లు దక్కాయి.

అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైన కాసేపటికే మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. వరుణుడు కరుణించాక తిరిగి మ్యాచ్ ప్రారంభమైంది. అంపైర్లు రెండో ఇన్నింగ్స్‌ను 8 ఓవర్లకు కుదించి టీమిండియా టార్గెట్‌ను 78 పరుగులుగా నిర్దేశించారు. ఆ లక్ష్యాన్ని భారత్ 6.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. ఓపెనర్ జైశ్వాల్(30), కెప్టెన్ సూర్యకుమార్(26), పాండ్యా(22 నాటౌట్) మెరుపులతో భారత్ అలవోకగా నెగ్గింది.

Tags:    

Similar News