IND vs WI 1st ODI: టీమిండియాకు బిగ్ షాక్.. కీలక ప్లేయర్ ఔట్!
వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.
దిశ, వెబ్డెస్క్: వెస్టిండీస్తో టెస్ట్ సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా గురువారం జరిగే తొలి వన్డేలో పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఆడటంపై సందేహాలు నెలకొన్నాయి. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న శార్దూల్ ఠాకూర్.. వెస్టిండీస్తో రెండో టెస్ట్ ఆడలేదు. ఈ మ్యాచ్ టాస్ అనంతరం బీసీసీఐ ఈ విషయాన్ని వెల్లడించింది. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్న శార్దూల్ ఠాకూర్ రెండో టెస్ట్ సెలెక్షన్కు అందుబాటులో లేడని పేర్కొంది.
అతని స్థానంలో బరిలోకి దిగిన ముకేష్ కుమార్ పర్వాలేదనిపించాడు. అయితే శార్దూల్ ఠాకూర్ గాయం పురోగతిపై ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ లేదు. బీసీసీఐ కూడా ఎలాంటి విషయాన్ని వెల్లడించలేదు. ఈ క్రమంలోనే శార్దూల్ ఠాకూర్ తొలి వన్డే ఆడటం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక శార్దూల్ ఠాకూర్ దూరమైతే అతని స్థానంలో అక్షర్ పటేల్ ఆడే అవకాశం ఉంది.