Zim Afro T10: జిమ్ ఆఫ్రో టీ10 లీగ్లో భారత మాజీ క్రికెటర్లు..
జింబాబ్వేలో త్వరలో జరగబోయే ప్రారంభ జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ టోర్నీలో ఆరుగురు భారత మాజీ క్రికెటర్లు ఆడబోతున్నారు.
న్యూఢిల్లీ : జింబాబ్వేలో త్వరలో జరగబోయే ప్రారంభ జిమ్ ఆఫ్రో టీ10 లీగ్ టోర్నీలో ఆరుగురు భారత మాజీ క్రికెటర్లు ఆడబోతున్నారు. మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, శ్రీశాంత్, పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ ఈ లీగ్లో పలు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలతో వాళ్లు ఒప్పందం చేసుకున్నారు.
శ్రీశాంత్, రాబిన్ ఊతప్ప, ఇర్ఫాన్ పఠాన్ హరారే హరికేన్స్కు ప్రాతినిధ్యం వహించనున్నారు. అలాగే, కేప్టౌన్ సాంప్ ఆర్మీ తరఫున పార్థివ్ పటేల్, స్టువర్ట్ బిన్నీ, జోహన్నెస్బర్గ్ బఫెలోస్ తరఫున యూసఫ్ పఠాన్ ఆడనున్నారు. ఈ నెల 20 నుంచి లీగ్ ప్రారంభం కానుండగా.. 29న ఫైనల్ జరగనుంది. ప్రారంభ సీజన్లో ఐదు జట్లు పోటీపడబోతున్నాయి.