సంచలన నిర్ణయం తీసుకున్న ఐపీఎల్ జట్టు

ఐపీఎల్ లో నిలకడ ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఉంటుంది.

Update: 2024-07-13 14:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ లో నిలకడ ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ఉంటుంది. అయితే కొన్ని సీజన్లుగా ఈ జట్టు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. 2024 సీజన్ లో కూడా ఆ జట్టు ఆరో స్థానంలో నిలిచింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. 2016 నుంచి ఆ జట్టుకు హెడ్ కోచ్ గా ఉన్న రికీ పాంటింగ్ ను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన హెడ్ కోచ్ కు సంబంధించిన కాంట్రాక్ట్ ను కూడా ముగించింది. అలాగే 2016 నుంచి 2024 వరకు మొత్తం ఎనిమిది సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సేవలు అందించినందుకు ఆ జట్టు యాజమాన్యం రికీ పాంటింగ్ కు ధన్యవాదాలు తెలిపింది. ఇదిలా ఉంటే.. 2025 సీజన్ కు ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ గా తానే ఉంటానని.. తనకు అవకాశం ఇవ్వాలని భారత మాజీ కెప్టెన్, డీసీ డైరెక్టర్ గంగూలీ.. మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలుస్తుంది.

Tags:    

Similar News