SRH ఓనర్ కావ్య పాపకు షేక్ హ్యాండ్ ఇచ్చిన CM రేవంత్ రెడ్డి

హైదరాబాదు ఉప్పల్ మైదానంలో శుక్రవారం రాత్రి IPL మ్యాచ్ జరిగింది.

Update: 2024-04-06 08:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాదు ఉప్పల్ మైదానంలో శుక్రవారం రాత్రి IPL మ్యాచ్ జరిగింది. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. చివర వరకు ఉత్కంఠంగా జరిగిన ఈ మ్యాచ్‌లో చెన్నైపై SRH జట్టు ఘనవిజయం సాధించింది. దీంతో హైదరాబాద్ ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. అయితే, ఈ మ్యాచ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కావడం ఆసక్తిగా మారింది. సీఎం రాకతో మైదానమంతా సందడి వాతావరణం నెలకొంది. మ్యాచ్ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి SRH యజమాని కావ్యకు షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతూ మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలకు SRH అభిమానులు లైక్‌లు, కామెంట్లతో ముంచెత్తుతున్నారు. కాగా, ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం నాలుగు మ్యాచులు ఆడిన హైదరాబాద్ జట్టు రెండు గెలిచి, రెండింట్లో ఓడిపోయింది. సొంత మైదానంలో ఆడిన రెండూ గెలిచింది.

Full View


Similar News