పారా ఒలంపిక్స్ లో భారత్ కు పతకాల పంట
పారిస్ లో జరుగుతున్న పారా ఒలంపిక్స్ లో భారత్ కు పతకాల పంట పండుతోంది.
దిశ, వెబ్ డెస్క్ : పారా ఒలంపిక్స్ (Para Olympics) లో భారత్(Bharath) కు పతకాల పంట పండుతోంది. తాజాగా జూడోలో కపిల్ పర్మార్ సాధించిన కాంస్య పతకంతో కలిపి మొత్తం 25 పతకాలు సాధించారు మన క్రీడాకారులు. కాగా జూడోలో భారత్ కు ఇది తొలి పతకం కావడం విశేషం. భారత్ ఇప్పటి వరకు 5 గోల్డ్, 9 సిల్వర్, 11 బ్రాంజ్ మొత్తం 25 పతకాలతో.. పట్టికలో 14వ స్థానంలో నిలిచింది. పారా ఒలంపిక్స్ లో మన దేశపు క్రీడాకారులు రికార్డ్ లెవల్లో పతకాలు సాధించడం పట్ల దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.