రోడ్డెక్కిన సర్పంచ్‎లు

దిశ ప్రతినిధి, నిజామాబాద్ :  కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సర్పంచ్‎ల సంఘం ధర్నా నిర్వహించింది. గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ.. గురువారం సర్పంచ్‎లు నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట పోలీసులు ఏర్పాట్లు చేసిన బారీకేడ్లను దాటుకొని లోపలికి వెళ్లి బైఠాయించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్ మాట్లాడుతూ.. విద్యుత్ దీపాల నిర్వహణ ప్రైవేట్‎కు అప్పగిస్తే గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి పడుతుందన్నారు. జీపీలలో నిర్మించిన […]

Update: 2020-11-05 03:31 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఎదుట సర్పంచ్‎ల సంఘం ధర్నా నిర్వహించింది. గ్రామ పంచాయతీల్లో ఎల్ఈడీ వీధి దీపాల నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ.. గురువారం సర్పంచ్‎లు నిరసన చేపట్టారు. కలెక్టరేట్ ఎదుట పోలీసులు ఏర్పాట్లు చేసిన బారీకేడ్లను దాటుకొని లోపలికి వెళ్లి బైఠాయించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు నరసింహులు యాదవ్ మాట్లాడుతూ.. విద్యుత్ దీపాల నిర్వహణ ప్రైవేట్‎కు అప్పగిస్తే గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి పడుతుందన్నారు. జీపీలలో నిర్మించిన వర్మీ కంపోస్ట్ షెడ్‎లు నిర్మించిన నిధుల విడుదల కాలేదని తెలిపారు. ఈ నిరసనలో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన సర్పంచ్ లు పాల్గొన్నారు.

Tags:    

Similar News