పెళ్లి బృందానికి రోడ్డుప్రమాదం  

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్లి బృందానికి రోడ్డుప్రమాదం జరిగింది. ఏలూరు సమీపంలో దుగ్గిరాల జాతీయ రహదారి వద్ద సోమవారం తెల్లవారుజామున టాటా మ్యాజిక్ వాహనాన్ని పాల వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. పెంటపాడులో పెళ్లి వేడుకల్లో పాల్గొని తిరిగి భద్రాచలం వెళుతుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఏలూరు […]

Update: 2020-10-26 06:02 GMT

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమగోదావరి జిల్లాలో పెళ్లి బృందానికి రోడ్డుప్రమాదం జరిగింది. ఏలూరు సమీపంలో దుగ్గిరాల జాతీయ రహదారి వద్ద సోమవారం తెల్లవారుజామున టాటా మ్యాజిక్ వాహనాన్ని పాల వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది స్వల్పంగా గాయపడ్డారు. పెంటపాడులో పెళ్లి వేడుకల్లో పాల్గొని తిరిగి భద్రాచలం వెళుతుండగా మార్గ మధ్యలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు భద్రాచలం మండలం చర్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

 

Tags:    

Similar News