డ్రగ్స్ కేసు.. ఈడీ ఎదుట హాజరైన పూరీ జగన్నాధ్.. మీడియాని పట్టించుకోకుండా..?

దిశ, వెబ్‌డెస్క్:  గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చి హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈ కేసును సిట్ తీసుకోగా.. ప్రస్తుతం ఈ కేసు బాధ్యతలను ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలోనే మొట్టమొదటగా ఈరోజు డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ను ఈడీ విచారించనుంది. […]

Update: 2021-08-31 00:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేపిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చి హాట్ టాపిక్ గా మారింది. గతంలో ఈ కేసును సిట్ తీసుకోగా.. ప్రస్తుతం ఈ కేసు బాధ్యతలను ఈడీ (ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్) చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించింది. ఈ క్రమంలోనే మొట్టమొదటగా ఈరోజు డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ను ఈడీ విచారించనుంది. కొద్దిసేపటి క్రితమే విచారణ నిమిత్తం ఈడీ ఆఫీస్ కు చేరుకున్న పూరీ మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కారు దిగిన వెంటనే కార్యాలయం లోపలికి వెళ్లిపోవడం, మీడియా ప్రతినిధులు మాట్లాడుతున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కొద్దిసేపటిలో విచారణ మొదలుకానుంది. విదేశీ బ్యాంక్‌ అకౌంట్లలో జమైన డబ్బు లెక్కలపై ఈడీ ఆరా తీయనుంది. విదేశీ అక్రమ లావాదేవీలు గుర్తిస్తే ‘ఫెమా’ కేసులూ నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది నిజమైతే అందులో భాగమైన ప్రముఖులపై మనీలాండరింగ్ కేసులు కూడా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News