ప్రధాన మంత్రి మోడీ దిష్టిబొమ్మ దగ్ధం

దిశ, భువనగిరి రూరల్ : భువనగిరి పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద అసెంబ్లీ అధ్యక్షులు ఎండీ అవెస్ చిష్టి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్ మాట్లాడుతూ.. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెలిమినేటి సురేష్ ఢిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడుతుండగా […]

Update: 2021-08-06 07:25 GMT

దిశ, భువనగిరి రూరల్ : భువనగిరి పట్టణంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించాలని స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద అసెంబ్లీ అధ్యక్షులు ఎండీ అవెస్ చిష్టి ఆధ్వర్యంలో ప్రధాని మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బర్రె నరేష్ మాట్లాడుతూ.. యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెలిమినేటి సురేష్ ఢిల్లీలో జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడుతుండగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి శివసేన రెడ్డి కుడి కాలును విరగొట్టడం జరిగిందని గుర్తు చేశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యువజన కాంగ్రెస్ నాయకులపై ఎన్ని కేసులు పెట్టినా భయభ్రాంతులకు గురిచేసినా భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, రానున్న రోజుల్లో మీకు అదే గతి పడుతుందని ప్రభుత్వాలను హెచ్చరించారు. ప్రజల కోసం ఎన్ని కేసులైన మేము ఎదుర్కొంటామని ప్రజలకోసమే పని చేస్తామని లాఠీలకు, తూటాలకు భయపడి వెనక్కి తగ్గేది లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన ప్రధాన కార్యదర్శులు శ్రీధర్, మహేందర్, బుర్హాన్, ఫయాజ్, కొండల్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎండీ మజహర్, మల్లారెడ్డి, చిక్కుల వెంకటేష్, శివకుమార్, కోట మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

బ్రేకింగ్: ఎమ్మెల్యే కోమటిరెడ్డికి తన ఇలాకాలోనే షాక్..

Tags:    

Similar News