Former MP MVV: బిగ్ బ్రేకింగ్.. మాజీ ఎంపీపై క్రమినల్ కేసు నమోదు..

విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీపై పోలీసులు క్రమినల్ కేసు నమోదు చేశారు.

Update: 2024-06-25 08:06 GMT

దిశ వెబ్ డెస్క్: విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీపై పోలీసులు క్రమినల్ కేసు నమోదు చేశారు. హయగ్రీవ భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకల కారణంగానే ఈ కేసు నమోదైనట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్తే.. ఎండాడలో సీనియర్ సిటిజన్స్ హౌసింగ్ కోసం 2010లో హయగ్రీవకు 12.51 ఎకరాలు కేటాయించారు. అయితే అప్పుడు తనని బెదిరించి నకిలీ పత్రాలను సృష్టించారని హయగ్రీవ భూముల డెవలపర్ చిలుకూరి జగదీష్ ని ఆరోపిస్తూ ఎంవీవీపై ఫిర్యాదు చేశారు. కాగా జగదీష్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎంవీవీతోపాటు ఆడిటర్ జీవీపై కూసు నమోదు చేశారు.


Similar News