నిజాయితీని చాటుకోవాలంటూ కంగనపై నెటిజన్ల ఫైర్!

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సుశాంత్ మరణం నుంచి బాలీవుడ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్న కంగన.. ముంబైలోని తన కార్యాలయాన్ని కూలగొట్టారని ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంతోనే సమరానికి సై అంది. ఆ తర్వాత సినిమాల వల్ల బిజీ అయిపోయిందా? లేక బీజేపీకి వత్తాసు పలుకుతుందో తెలియదు కానీ.. మనీషా వాల్మీకి హత్యాచారం కేసులో అంతగా స్పందించలేదు. దీంతో కంగనపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ఉత్తర […]

Update: 2020-10-06 05:18 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సుశాంత్ మరణం నుంచి బాలీవుడ్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్న కంగన.. ముంబైలోని తన కార్యాలయాన్ని కూలగొట్టారని ఏకంగా మహారాష్ట్ర ప్రభుత్వంతోనే సమరానికి సై అంది. ఆ తర్వాత సినిమాల వల్ల బిజీ అయిపోయిందా? లేక బీజేపీకి వత్తాసు పలుకుతుందో తెలియదు కానీ.. మనీషా వాల్మీకి హత్యాచారం కేసులో అంతగా స్పందించలేదు.

దీంతో కంగనపై విరుచుకుపడుతున్నారు నెటిజన్లు. ఉత్తర ప్రదేశ్‌లోని హత్రాస్‌లో జరిగిన ఘటనపై సరైన విధంగా స్పందించలేదని మండిపడుతున్నారు. దళిత యువతి మృతిపై వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. యూపీలో బీజేపీ ప్రభుత్వం ఉందనే ఈ ఘటనపై మాట్లాడటం లేదని ఆరోపిస్తున్న నెటిజన్లు.. దీనిపై ప్రభుత్వాన్ని నిలదీసి నిజాయితీని చాటుకోవాలని అంటున్నారు.

మహారాష్ట్ర శివసేన ప్రభుత్వంతో వైరికి దిగిన కంగనపై శివసేన కార్యకర్తలు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. సుశాంత్ మృతిపై చర్చలు పెట్టిన కంగన.. దళిత యువతి అన్యాయంగా చనిపోతే తన గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News