Mumbai : ముంబై నడిరోడ్డుపై మహిళను వేధించిన కామాంధుడు

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర రాజధాని ముంబైలో నడిరోడ్డుపై మహిళ (34)ను ఓ కామాంధుడు వేధించాడు.

Update: 2024-08-21 14:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర రాజధాని ముంబైలో నడిరోడ్డుపై మహిళ (34)ను ఓ కామాంధుడు వేధించాడు. మంగళవారం రాత్రి నగరంలోని కుర్లా ఏరియాలో ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని 42 ఏళ్ల గణేశ్ ప్రసాద్‌గా గుర్తించారు. బాధిత మహిళ చునాభట్టి సబర్బన్ రైల్వే స్టేషన్‌లో రైలు దిగింది. ఆమె కుర్లా ఏరియాలోని స్కై వాక్ మీదుగా నడుచుకుంటూ ఇంటికి వెళ్తుండగా మార్గం మధ్యలో వెనుక నుంచి వచ్చిన గణేశ్ ప్రసాద్‌ ఆమెను కౌగిలించుకున్నాడు.

తనను వదలమని సదరు మహిళ అరిచినా వినిపించుకోలేదు. దీంతో బాధిత మహిళ గట్టిగా అరిచింది. అటుగా వెళ్తున్నవారు వెంటనే గణేశ్ ప్రసాద్‌ను చుట్టుముట్టి చితకబాదారు. అతడికి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స జరిగింది. అనంతరం పోలీసులు అదుపులోకిి తీసుకున్నారు. నిందితుడు ముంబైలోని ఖర్ ఏరియాకు చెందినవాడని గుర్తించారు. కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News