Viral News: రూ.30 ఆటో చార్జీ కోసం గొడవ.. స్నేహితుడిని చంపిన యువకుడు

ఆటో చార్జీ విషయంలో గొడవ కారణంగా స్నేహితుడ్ని చంపిన దారుణమైన ఘటన ముంబైలో చోటుచేసుకుంది.

Update: 2024-08-13 07:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఆటో చార్జీ విషయంలో గొడవ కారణంగా స్నేహితుడ్ని చంపిన దారుణమైన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో రూ.5 ఫ్యాక్షన్ గురించి వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో అలాంటి గొడవల వల్ల జరిగిన హత్యలే ఎక్కువగా జరుగుతున్నాయి. గత కొద్ది రోజుల క్రితం ఒక రూపాయి కోసం స్నేహితుడినే చంపిన ఘటన వరంగల్ లో జరిగింది. తర్వాత బిర్యానీ డబ్బుల కోసం ఫ్రెండ్ ని హత్య చేసిన ఘటన జరిగింది. ఇలాంటి ఘటనే ముంబైలోని కుర్లా ప్రాంతలో జరిగింది.

ఉత్తరప్రదేశ్ లోని గోండా కు చెందిన సైఫ్ జాహిద్ అలీ, చక్కన్ అలీ స్నేహితులు. వీరు ఇటీవలే ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో పని చేసేందుకు ముంబై వెళ్లారు. అక్కడ కుర్లా ప్రాంతంలో దిగి ఆటో రిక్షా చార్జీ చెల్లించే విషయంలో స్నేహితుల మధ్య వివాదం తలెత్తింది. గొడవ కాస్త ముదిరి హింసకు దారి తీయడంతో సహనం కోల్పోయిన జాహిద్ అలీ తన స్నేహితుడు చక్కన్ అలీని హత్య చేశాడు. స్నేహితుడిని చంపిన అనంతరం నిందితుడు జాహిద్ అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి నిందితుడు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై ముంబై క్రైం బ్రాంచ్ కు సమాచారం అందించడంతో క్రైం బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగారు. కళ్యాణ్ రైల్వే స్పేషన్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసి కుర్లా పోలీసులకు అప్పగించారు.

Tags:    

Similar News