కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియా

ప్రభుత్వ రెజ్లర్లు వినేష్ ఫొగాట్, భజరంగ్ పూనియా కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఆ పార్టీలో చేశారు.

Update: 2024-09-06 10:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రెజ్లర్లు వినేష్ ఫొగాట్, భజరంగ్ పూనియా కాంగ్రెస్‌లో చేరారు. శుక్రవారం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఆ పార్టీలో చేశారు. వీరికి కండువా కప్పి ఆహ్వానించారు. కాగా, త్వరలో జరుగబోయే హరియాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ పోటీ చేయనున్నారు. వినేష్ ఫొగాట్‌కు హరియాణాలోని మూడు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయడానికి ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. మరోవైపు భజరంగ్ పూనియాకు కూడా కాంగ్రెస్ ఆఫర్ ఇచ్చింది. ఆయనకు రెండు అసెంబ్లీ స్థానాలు సూచించి.. ఒక దాంట్లో పోటీ చేయాలని చెప్పింది. ఈ రెండు స్థానాల్లో ఏ స్థానం నుంచి పోటీ చేసినా భజరంగ్ పూనియా విజయం ఖాయమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. మరోవైపు.. వినేష్ ఫొగాట్‌కు మంచి ఆదరణ ఉన్న మూడు నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వడంతో ఆమె గెలుపు కూడా సునాయాసం అని భావిస్తున్నారు.


Similar News