Delhi: కోర్టులో గన్ ఫైర్ కలకలం..
ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కాల్పులు జరిగాయి.
న్యూఢిల్లీ : ఢిల్లీలోని తీస్ హజారీ కోర్టులో కాల్పులు జరిగాయి. కోర్టు ఆవరణలో రెండు గ్రూపుల లాయర్ల మధ్య జరిగిన వాగ్వాదం చినికి చినికి గాలివానగా మారింది. ఈక్రమంలో లాయర్లలో కొందరు తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపారు. బుధవారం మధ్యాహ్నం 1.35 గంటల టైంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తాము వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చామని స్థానిక పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు.
కోర్టు ప్రాంగణంలో కాల్పుల వ్యవహారాన్ని ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ ఖండించారు. దీనిపై సమగ్ర విచారణ చేపడతామని చెప్పారు. కోర్టు ఆవరణలో ఏ న్యాయవాది కూడా ఆయుధాలను ఉపయోగించకూడదని ఆయన పేర్కొన్నారు. “ఈ కాల్పులు జరిపేందుకు వాడిన గన్ కు లైసెన్స్ ఉందా .. లేదా.. అనేదానిపై విచారణ చేస్తాం. ఆయుధాలకు లైసెన్స్ ఉన్నా .. కోర్టు ప్రాంగణంలో దాన్ని వాడటం చట్ట విరుద్ధం” అని ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ వెల్లడించారు.
Delhi | A firing incident reported at Tis Hazari Court premises, no injuries reported. Police say that this happened after an argument among lawyers.
— ANI (@ANI) July 5, 2023
(Note: Abusive language)
(Video Source: A lawyer) pic.twitter.com/MMPOQwpWaZ