Union Budget 2024: డ్వాక్రా మహిళలకు రుణ సాయం రెట్టింపు చేస్తున్నట్లు ప్రకటన

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో స్వయం ఉపాధి పొందుతున్న చేతి వృత్తి మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు.

Update: 2024-07-23 06:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో స్వయం ఉపాధి పొందుతున్న చేతి వృత్తి మహిళలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం నుంచి చేతి వృత్తి మహిళలకు ఇచ్చే రుణం సాయాన్ని పెంచుతున్నట్లు ఆమె ప్రకటించారు. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న డ్వాక్ర మహిళలకు ప్రస్తుతం వస్తున్న దానికంటే ఎక్కువ మొత్తంలో లోన్లు వచ్చేందుకు అవకాశం ఉంది. ఈ నిర్ణయం మహిళలకు ఎంతగానో తోడ్పడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో చెప్పుకొచ్చారు. దీని ద్వారా ముద్రా లోన్ రూ. 20 లక్షలకు పెరిగిందని.. గతంలో ఇది రూ. 10 లక్షల వరకు మాత్రమే ఉండేదని తెలిపారు. ఈ ముద్ర లోన్లను వాణిజ్య బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు అందిచనున్నట్లు తెలిపారు. 

Tags:    

Similar News