Dharmarao Baba Atram : నా కూతురు, అల్లుడిని ప్రాణహిత నదిలో పడేయండి.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ శాఖ మంత్రి, ఎన్సీపీ(అజిత్ పవార్) నేత ధర్మారావు బాబా ఆత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-09-07 11:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో : మహారాష్ట్ర ఆహార, ఔషధ నియంత్రణ శాఖ మంత్రి, ఎన్సీపీ(అజిత్ పవార్) నేత ధర్మారావు బాబా ఆత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కూతురు, అల్లుడు త్వరలోనే శరద్ పవార్ వర్గం ఎన్సీపీలో చేరబోతున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. వాటిపై తీవ్రంగా స్పందించిన మంత్రి ధర్మారావు బాబా.. ‘‘కూతురు భాగ్యశ్రీ, అల్లుడు రితురాజ్ హల్కేగర్ నాకు నమ్మకద్రోహం చేశారు. వాళ్లను ప్రాణహిత నదిలోకి లాగి పడేయండని అహేరీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలను కోరుతున్నాను’’ అని ఆయన వివాదాస్పద కామెంట్ చేశారు.

ఎన్సీపీ (అజిత్) చీఫ్ అజిత్‌పవార్ ‘జన్ సన్మాన్’ యాత్రలో భాగంగా అహేరీ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. ఈసందర్భంగా అజిత్ పవార్ సమక్షంలో మంత్రి ధర్మారావు బాబా ఆత్రం ప్రసంగిస్తూ.. తన కూతురు, అల్లుడు పార్టీ మారబోతున్నారనే వార్తలపై సీరియస్ అయ్యారు. ‘‘శరద్ పవార్ వర్గం నా కుటుంబాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తోంది. నా కూతురిని నాపైనే పోటీకి నిలిపేందుకు కుట్ర పన్నుతోంది. నా కూతురు, అల్లుడిని అస్సలు నమ్మొద్దు’’ అని ఓటర్లకు ఆయన సూచించారు.


Similar News