శరద్పవార్ను చంపేస్తామంటూ బెదిరింపులు
ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్కు హత్య బెదిరింపులు వచ్చాయి.
దిశ, డైనమిక్ బ్యూరో : ఎన్సీపీ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్కు హత్య బెదిరింపులు వచ్చాయి. తన తండ్రి పవార్ను చంపేస్తానంటూ కొందరు గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడినట్లు పవార్ కుమార్తె, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే తెలిపారు. శుక్రవారం సుప్రియా మీడియాతో మాట్లాడుతూ...‘గురువారం నాకు వాట్సాప్ ద్వారా ఈ బెదిరింపు మెసేజ్ వచ్చింది. చంపేస్తానంటూ ఆగంతుకులు సందేశం పంపారు. దీంతో నేను పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశాను. ఈ విషయంతో మహారాష్ట్ర హోంమంత్రి, కేంద్రహోంమంత్రి జోక్యం చేసుకోవాలి. ఆయన భద్రత బాధ్యత హోంశాఖదే. దీనిపై అమిత్ షా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు నీచ రాజకీయాలకు నిదర్శనం’ అంటూ సుప్రియా అన్నారు. దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.