BJP : సభ్యత్వ నమోదులో దూసుకెళ్తున్న బీజేపీ.. భిన్న రంగాల నుంచి చేరికలు

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఎంతోమంది బీజేపీలో చేరుతున్నారు.

Update: 2024-09-30 19:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ సభ్యత్వ నమోదు ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఎంతోమంది బీజేపీలో చేరుతున్నారు. సోమవారం రోజు ఢిల్లీలో కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి నివాసంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో విభిన్న రంగాలకు చెందిన దాదాపు 30 మంది బీజేపీలో చేరారు. హర్దీప్ సింగ్ వారికి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. పార్టీలో కొత్తగా చేరిన వారు ఆరోగ్య, పారిశ్రామిక, పర్యావరణ, స్వచ్ఛంద సేవ వంటి భిన్న రంగాలకు చెందినవారు కావడం గమనార్హం. ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాలనా విధానంతో ప్రభావితమై వీరంతా బీజేపీలో చేరారని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు.


Similar News