MP చెంపచెల్లుమనిపించిన మహిళ.. ఎందుకో తెలుసా..? (వీడియో)

ఓ మహిళ ఎంపీ చెంపచెల్లుమనిపించింది.

Update: 2024-07-18 05:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఓ మహిళ రాజ్యసభ ఎంపీ చెంపచెల్లుమనిపించింది. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. మహారాష్ట్ర బీఎస్పీ(బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ) రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్‌ను ఓ మహిళా కార్యకర్త కలిసేందుకు వెళ్లారు. మీటింగ్ జరుగుతుండగా కొంత మంది ఎంపీ ముందు నుంచి అభివాదం చేస్తూ వెళ్లారు. ఇంతలోనే ఓ మహిళా కార్యకర్త సదరు ఎంపీని చెంపపై లాగి కొట్టారు. ఒక్కసారిగా షాక్ అయిన ఎంపీ అభిమానులు ఆమెను పక్కకు లాగేశారు. అయితే లోక్‌సభ ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపులో అసంతృప్తే దాడికి కారణమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఘటన బుధవారం దాద‌ర్‌లో చోటు చేసుకుంది. అయితే దాడి చేసిన మహిళను బాంద్రాకు చెందిన నీమా మోహర్‌కార్‌గా గుర్తించారు. ఎంపీ చెంపపై కొట్టిన మహిళపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పార్టీ నుంచి సైతం ఆ మహిళను సస్పెండ్ చేశారు. కాగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News