కేంద్ర కేబినెట్లో ఏడు కీలక నిర్ణయాలు
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
దిశ, వెబ్డెస్క్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల కోసం రూ.13,966 కోట్లు కేటాయింపు, రైతుల కోసం డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏర్పాటు, డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కు రూ.2817 కోట్లు, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సెక్యూరిటీకి రూ.3979 కోట్లు, పశువుల ఆరోగ్యం, డైరీ ఉత్పత్తులకు రూ.1702 కోట్లు, హార్టీకల్చర్ అభివృద్ధికి రూ.860 కోట్లు, కృషి విజ్ఞాన్ కేంద్రం అభివృద్ధికి రూ.1,202 కోట్లు, నేచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం రూ.1,115 కోట్లు, 309 కిలోమీటర్ల రహదారికి రూ.18,036 కోట్లు, మన్మాడ్-ఇండోర్ రహదారికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.