ఎస్సీలకు గుడ్‌న్యూస్.. ముఖ్యమంత్రి కీలక ప్రకటన

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రకటన చేశారు.

Update: 2023-08-28 15:18 GMT

చండీగఢ్ : అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కీలక ప్రకటన చేశారు. గ్రూప్ ఏ, గ్రూప్ బీ ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సోమవారం వెల్లడించారు. ఇంతకుముందు కేవలం గ్రూప్ సీ, గ్రూప్ డీ ఉద్యోగాల ప్రమోషన్లలోనే ఎస్సీలకు రిజర్వేషన్లు ఉండేవని.. తాము చొరవ చూపి వాటిని గ్రూప్ ఏ, బీలోని ఉద్యోగులకూ అందుబాటులోకి తెచ్చామన్నారు.

హయ్యర్ క్యాడర్‌ జాబ్స్‌లో ఎస్సీ వర్గం వారి వాటాకు సంబంధించిన గణాంకాలను విశ్లేషించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం ఖట్టర్ స్పష్టం చేశారు. ప్రమోషన్లలో కొత్త కల్పించిన ఈ రిజర్వేషన్‌కు సంబంధించి వారం రోజుల్లోగా నోటిఫికేషన్, గైడ్ లైన్స్‌ను విడుదల చేస్తామని తెలిపారు. ఎస్సీ వర్గం వారు సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కొంటే వాటి ధరపై 20 శాతం డిస్కౌంట్ అందిస్తామని చెప్పారు.


Similar News