RBI Governor: ఆర్బీఐ గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన సంజయ్ మల్హోత్రా
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) బాధ్యతలు స్వీకరించారు.
దిశ, నేషనల్ బ్యూరో: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నూతన గవర్నర్గా సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) బాధ్యతలు స్వీకరించారు. ఆర్బీఐ 26వ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన సంజయ్.. వచ్చే మూడేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగనున్నారు. గతంలో రెవెన్యూ శాఖ కార్యదర్శి సంజయ్ మల్హోత్రా (Sanjay Malhotra) పనిచేశారు. డిసెంబర్ 10తో ఆర్బీఐ గవర్నర్ గా శక్తికాంత దాస్ పదవీ కాలం ముగిసింది. కొత్త గవర్నర్ను నియామకానికి కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది. సంజయ్ ని కొత్త గవర్నర్ గా కేంద్రం నియమించింది.
సంజయ్ మల్హోత్రా ఎవరంటే?
సంజయ్ మల్హోత్రా 1990 బ్యాచ్ రాజస్థాన్ బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఐటీ కాన్పూర్లో కంప్యూటర్ సైన్స్లో ఇంజినీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి పబ్లిక్ పాలసీలో మాస్టర్స్ అభ్యసించారు. విద్యుత్, ఆర్థిక, పన్నులు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మైన్స్ తదితర రంగాల్లో మూడు దశాబ్దాలకు పైగా సర్వీసులందించారు. ఆర్బీఐ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖలోని రెవెన్యూ విభాగం కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక, పన్నుల విషయంలో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. ఆర్థిక, ట్యాక్సేషన్లోనూ పట్టు ఉంది. ప్రత్యక్ష, పరోక్ష పన్నులకు సంబంధించిన విధాన రూపకల్పనలోనూ ఆయన కీలకంగా వ్యవహరించారు.