Modi speaks to Putin : ఉక్రెయిన్ పర్యటనపై పుతిన్‌కు ప్రధాని ఫోన్.. మోడీ ఆసక్తికర ట్వీట్

Update: 2024-08-27 11:08 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారత్-రష్యాల మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ప్రధాని మోడీ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్‌‌తో ఫోన్‌లో సంభాషించారు. రష్యా-ఉక్రెయిన్ వివాదంపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ తాజాగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఇటీవల ఉక్రెయిన్ సందర్శన ద్వారా పొందిన విషయాలను ఇరు దేశాల మధ్య పంచుకున్నామని తెలిపారు. ఉక్రెయిన్-రష్యా వివాదాన్ని సత్వరంగా పరిష్కరించేందుకు, శాంతి-సుస్థిరతలు నెలకొనేందుకు భారత్ పూర్తి మద్దతు అందిస్తుందని పుతిన్‌తో ప్రధాని విృస్తృత చర్చలు జరిపారు. కాగా, ప్రధాని మోడీ ఇటీవల ఉక్రెయిన్ పర్యటించిన సంగతి తెలిసిందే.

అధ్యక్షుడు జెలెన్‌స్కీని కలిసి చర్చలు జరిపారు. ఈ భేటీలో భారత్ ఎల్లప్పుడూ శాంతికి అనుకూలంగా ఉంటుందని మోడీ జెలెన్‌స్కీతో చర్చలు జరిపారు. నేడు పుతిన్‌‌తో ప్రధాని మోడీ చర్చలు జరిపామనే ట్వీట్ వైరల్‌గా మారింది. భారత్ శాంతికి చిహ్నం అని, ప్రధాని మోడీ ఇరు దేశాల నాయకులతో చర్చలు జరపడం గ్రేట్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


Similar News