Dharmendra Pradhan : విద్యార్థుల చదువులపై రాజకీయాలు చేయొద్దు.. సీఎం స్టాలిన్‌కు కేంద్ర విద్యామంత్రి లేఖ

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం లేఖ రాశారు.

Update: 2024-08-30 19:25 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌కు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శుక్రవారం లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వాల పాఠశాలలను అత్యుత్తమ విద్యాసంస్థలుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘పీఎం శ్రీ’ స్కీంను తమిళనాడులోనూ అమలు చేయాలని సీఎంను కోరారు. విద్యార్థుల చదువులు, భవిష్యత్తుతో ముడిపడిన అంశాల విషయంలో రాజకీయ ఎజెండాలతో రాద్ధాంతం చేయడం సరికాదని ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు. ‘పీఎం శ్రీ’ స్కీంకు సంబంధించిన ఎంఓయూపై సంతకం చేయాలని సీఎం స్టాలిన్‌కు సూచించారు.


Similar News