PM Modi : రేపటి నుంచి ప్రధాని మోడీ విదేశీ పర్యటన

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు బ్రూనై, సింగపూర్ దేశాల్లో పర్యటించనున్నారు.

Update: 2024-09-02 15:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ప్రధానమంత్రి నరేంద్రమోడీ మంగళవారం నుంచి మూడు రోజుల పాటు బ్రూనై, సింగపూర్ దేశాల్లో పర్యటించనున్నారు. తొలుత మంగళ, బుధవారాల్లో బ్రూనైను భారత ప్రధాని సందర్శిస్తారు. తిరుగు ప్రయాణంలో బ్రూనై నుంచి నేరుగా సింగపూర్‌కు చేరుకుంటారు. గురువారం రోజు సింగపూర్ ప్రభుత్వాధినేతలతో భేటీ అయి ద్వైపాక్షిక సంబంధాలు, సైనిక సహకార పరమైన అంశాలపై చర్చిస్తారు.

బ్రూనైతో భారత్ దౌత్య సంబంధాలు మొదలై 40 ఏళ్లు గడిచిపోయాయి. ఈ సుదీర్ఘ ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని గౌరవిస్తూ తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా భారత ప్రధాని మోడీని బ్రూనై సుల్తాన్ హాజీ హసన్ అల్ బోల్కియా ఆహ్వానించారు. అందుకే బ్రూన్ పర్యటనకు మోడీ వెళ్తున్నారు.


Similar News