కర్ణాటకలో 'ఆపరేషన్ కమలం' : సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు

బీజేపీ అధిష్టానం మీద కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-30 13:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ అధిష్టానం మీద కర్ణాటక సీఎం సిద్దరామయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నడనాట 'ఆపరేషన్ కమలం'కు బీజేపీ వ్యూహ రచన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు మోడీ అండ్ కో కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. బీజేపీ దాని మిత్ర పక్ష జేడీఎస్ తో కలిసి మా ప్రభుత్వాన్ని కూల్చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. కానీ కన్నడ ప్రజలు బీజేపీని గాని, మోడీని గాని ఎప్పుడూ నమ్మలేదని.. వారు మాత్రం  ప్రజల ఆశీస్సులు పొంది అధికారంలోకి రాకుండా.. ఎమ్మెల్యేలను లాక్కొని దొడ్డిదారిలో గద్దెమీద కూర్చున్నారని ఎద్దేవా చేశారు. 136 మంది ఎమ్మెల్యేలు ఉన్న అతి పెద్ద ప్రభుత్వాన్ని కూల్చేయడం బీజేపీకి ఎన్నటికీ సాధ్యం కాదని సిద్దరామయ్య ధీమా వ్యక్తం చేశారు. 


Similar News