ఒడిశాలో అమానుషం.. ఆడ శిశువును అమ్మేసిన అమ్మ

ఆ మహిళ తన బిడ్డకు కూడా రేటు కట్టింది.

Update: 2023-07-05 12:18 GMT

మయూర్‌ భంజ్ (ఒడిశా) : ఆ మహిళ తన బిడ్డకు కూడా రేటు కట్టింది. 8 నెలల ఆడ శిశువును రూ.800కు అమ్మేసింది. ఒడిశాలోని మయూర్‌ భంజ్ జిల్లా ఖుంటా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహూలియా గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. అతడు పనిమీద తమిళనాడుకు వెళ్లిన టైంలో భార్య దారుణానికి తెగించింది. మాహీ ముర్ము అనే వ్యక్తి మధ్యవర్తిత్వంతో ఫుల్‌మండి మరాండి, టుదుకుడ్ దంపతులకు తన రెండో బిడ్డను సోమవారం రోజు (జులై 3న) విక్రయించింది.

అందుకుగానూ వారి నుంచి రూ.800 తీసుకుంది. తమిళనాడు నుంచి ఊరికి తిరిగొచ్చిన భర్తకు.. తాను బిడ్డను అమ్మేసిన విషయాన్ని చెప్పడంతో ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఆ మహిళను అరెస్టు చేసిన పోలీసులు.. చిన్నారిని స్వాధీనం చేసుకున్నారు. బిడ్డ అమ్మకంలో కీలక పాత్ర పోషించిన ముగ్గురిని అరెస్ట్ చేశారు.


Similar News