Congress : మధ్యప్రదేశ్ సీఎం ఇంటి ముట్టడి ఉద్రిక్తం
దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భోపాల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.
దిశ, నేషనల్ బ్యూరో : బీజేపీ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం భోపాల్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా పెద్దసంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు నగరంలోని రంగ్ మహల్ క్రాసింగ్ వద్ద రోడ్డుపై బైఠాయించాయి. అనంతరం వారంతా మధ్యప్రదేశ్ సీఎం అధికారిక నివాసం వైపు దూసుకెళ్లేందుకు యత్నించారు. ఈక్రమంలో రోషన్పురా క్రాసింగ్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులను పోలీసులు అడ్డుకున్నారు.
అయినా బ్యారికేడ్లను దాటుకుంటూ కొందరు ముందుకు వెళ్లేందుకు యత్నించారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ క్యానన్లను ప్రయోగించారు. పంటలకు కనీస మద్దతు ధరను అందించడంలో, నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ నేతలు ఈసందర్బంగా మండిపడ్డారు. నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో సామాన్యుల జీవితం పెనుభారంగా మారిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను బీజేపీ నిలుపుకోలేకపోయిందని విమర్శించారు.