పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు.. ఇద్దరు జవాన్లు దుర్మరణం

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఇటీవల వరుస ఎన్ కౌంటర్లు జరుగుతోన్న విషయం తెలిసిందే.

Update: 2024-06-23 12:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో ఇటీవల వరుస ఎన్ కౌంటర్లు జరుగుతోన్న విషయం తెలిసిందే. మావోయిస్టులే లక్ష్యంగా కూంబింగ్ చేపడుతోన్న భద్రతా దళాలు.. నక్సలైట్లను ఎక్కడిక్కకడ మట్టుబెడుతున్నారు. రెండు నెలల వ్యవధిలోనే దాదాపు 150 మందికి పైగా నక్సలైట్లు ఎన్ కౌంటర్లలో మరణించారు. ఈ క్రమంలో మావోయిస్టులు పోలీసులపై రివేంజ్ తీర్చుకున్నారు. ఆదివారం మందుపాతరతో పోలీస్ వాహనాన్ని పేల్చేశారు.

ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని సిలిగురి- టేకులగూడెం రహదారిలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన జవాన్లను విష్ణు, శైలేంద్రగా గుర్తించారు. ఘటన స్థలాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Similar News