లడ్డూ వివాదం.. నటి ఖుష్బూ సంచలన ట్వీట్

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. దేశంలోని పలు రంగాల ప్రముఖులు ఈ వివాదంపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఘటనపై తాజాగా బీజేపీ నాయకురాలు, సీనియర్ నటి ఖుష్బూ ఎక్స్ వేదికగా స్పందించారు

Update: 2024-09-27 08:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. దేశంలోని పలు రంగాల ప్రముఖులు ఈ వివాదంపై తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఘటనపై తాజాగా బీజేపీ నాయకురాలు, సీనియర్ నటి ఖుష్బూ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలపడం దారుణం. బాధ్యులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఎవర్ని వదిలిపెట్టకూడదన్నారు. బాధ్యులు కచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సిందేనని.. మీరు చేసిన తప్పు వేంకటేశ్వర స్వామి చూస్తున్నాడంటూ నటి ఖుష్బూ ట్వీట్ చేశారు. తిరుమల లడ్డూలు కల్తీ చేయడమంటే కోట్లాది మంది ప్రజల మనోభావాలు, విశ్వాసాలను దెబ్బతీయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు.

తాను హిందూ మతంలో పుట్టకపోయినప్పటికీ ఆ మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. తనకు అన్ని మతాలు సమానమేనని, హిందూ మతాన్ని అవమానించవద్దని హితవు పలికారు. హిందూ మతాన్ని చులకనగా మాట్లాడొద్దని, దానిని అగౌరవపరిస్తే సహించకూడదన్నారు. హిందూ మతాన్ని లక్ష్యంగా చేసుకున్నప్పుడు మనల్ని సైలెంట్‌గా ఉండమంటే ఎలా అని ప్రశ్నించారు. ఇతర మతాల విషయంలో ఇలాగే వ్యవహరిస్తారా? అని ఖుష్బూ సోషల్ మీడియా పోస్టులో నిలదీశారు.


Similar News