Kolkata doctor rape: గొంతు నులిమి హత్య.. ట్రైనీ డాక్టర్ పోస్టు మార్టం నివేదికలో కీలక విషయాలు!

కోల్‌కతాలోని ఆర్‌జీకర్ ఆస్పత్రిలో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది.

Update: 2024-08-19 13:29 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కోల్‌కతాలోని ఆర్‌జీకర్ ఆస్పత్రిలో హత్యకు గురైన ట్రైనీ డాక్టర్ పోస్టుమార్టం నివేదికలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడి అనంతరం గొంతు నులిమి హత్య చేసినట్టు తేలింది. లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు కూడా లభించాయి. అంతేగాక ఆమె చెంపలు, పెదవులు, ముక్కు, మెడ, చేతులు, మోకాళ్లపై 16కు పైగా గాయాలు ఉన్నాయని పలు నివేదికలు పేర్కొన్నాయి. శరీరం లోపల సైతం 9చోట్ల గాయాలు గుర్తించినట్టు వెల్లడించింది. ప్రయివేటు భాగాల్లోనూ గాయాలు ఉన్నట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. ఊపిరితిత్తులలో రక్తస్రావం, శరీరంలో రక్తం గడ్డకట్టడం వంటివి ఉన్నాయని తెలుస్తోంది. ఆగస్టు 9 తెల్లవారుజామున ఈ ఘటన జరిగినట్లు అంచనా వేస్తున్నారు. డ్యూటీ అనంతరం రెస్ట్ తీసుకోవడానికి ట్రైనీ డాక్టర్ సెమినార్ హాల్‌కు వెళ్లగా అక్కడే దాడి జరిగినట్టు పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు మెడికల్ కాలేజీ, హాస్పిటల్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై సీబీఐ విచారించింది. తమ కుమార్తె మృతదేహాన్ని చూసేందుకు అనుమతించకుండా బాధితురాలి తల్లిదండ్రులను మూడు గంటలపాటు ఎందుకు నిలిపివేశారని ఆయనను ప్రశ్నించినట్టు సమాచారం.

Tags:    

Similar News