G20 Summit: మోడీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ కాల్ చేశారు.
న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ కాల్ చేశారు. సెప్టెంబరు 9-10 తేదీల్లో ఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు తాను హాజరుకాలేనని, తన తరఫున విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్రోవ్ను పంపిస్తానని చెప్పారు. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ.. ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం చేసుకోగలమని తెలిపారు. జీ20కి భారత్ సారథ్యాన్ని సమర్ధించినందుకు పుతిన్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై పుతిన్, మోడీ చర్చించారు.