శివుడు మూడో కన్ను తెరిస్తే రాహుల్ బూడిదే..బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్ సభలో చేసిన హిందూ వ్యాఖ్యలను ఉద్దేశించి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-07-09 13:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇటీవల లోక్ సభలో చేసిన హిందూ వ్యాఖ్యలను ఉద్దేశించి కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్ హిందూ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నారని విమర్శించారు. రాహుల్ ప్రవర్తన చూస్తుంటే ఆయనకు పిచ్చి పట్టిందని స్పష్టంగా అర్థమవుతోందని తెలిపారు. మంగళవారం మంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు గానూ రాహుల్‌ను పార్లమెంటులోనే బంధించి చెంపదెబ్బ కొట్టి ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. శివుని చిత్రాన్ని ప్రదర్శించడాన్ని ప్రస్తావిస్తూ..‘హిందువులు హింసాత్మకులని రాహుల్ చెప్పారు. కానీ శివుడు తన మూడో కన్ను తెరిస్తే బూడిదగా మారతాడని ఆయనకు తెలియదు’ అని మండిపడ్డారు.

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాహుల్ తను పర్యటించే ప్రాంతాన్ని బట్టి ప్రవర్తిస్తారని తెలిపారు. గుజరాత్ వెళ్ళినప్పుడు పరమశివుని భక్తుడు అవుతాడు, తమిళనాడును సందర్శించినప్పుడు నాస్తికుడిగా మారతారు, కేరళలో లౌకికవాది అవుతాడు అని ఆరోపించారు. 99 సీట్లు మాత్రమే గెలుచుకున్న కాంగ్రెస్ ఎంతో గొప్ప విజయం సాధించిట్టుగా భావిస్తున్నారని ఎద్దేవా చేశారు. హిందువుల గురించి మాట్లాడితే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాహుల్ పార్లమెంటులో స్థానిక నాయకులు ఇక్కడ తోక ఊపుతారని విమర్శించారు. 


Similar News