చెంబూర్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

శనివారం మధ్యాహ్నం ముంబైలోని చెంబూర్ రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Update: 2024-10-19 12:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: శనివారం మధ్యాహ్నం ముంబైలోని చెంబూర్ రైల్వే స్టేషన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు ఆందోళనకు గురై.. స్టేషన్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఘటనా స్థలంలో గందరగోళ వాతావరణం నెలకొంది. కాగా రైల్వే స్టేషన్ ప్రాంతంలో నల్లటి పొగ కమ్ముకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ప్రమాదం సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కాగా ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందనే వివరాలు తెలియాల్సి ఉండగా.. ప్రస్తుతానికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు.


Similar News