Coaching institute: సివిల్స్ కోచింగ్ సెంటర్‌లోకి భారీ వరద..ఇద్దరు విద్యార్థినులు మృతి

సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలోని ప్రముఖ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌లోని బేస్ మెంట్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో ఇద్దరు విద్యార్థినులు మరణించారు.

Update: 2024-07-27 19:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: సెంట్రల్ ఢిల్లీలోని ఓల్డ్ రాజిందర్ నగర్ ప్రాంతంలోని ప్రముఖ సివిల్ సర్వీస్ కోచింగ్ సెంటర్‌లోని బేస్ మెంట్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో ఇద్దరు విద్యార్థినులు మరణించారు. మరికొందరు విద్యార్థులు అందులోనే చిక్కుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..రావు ఐఏఎస్ కోచింగ్ ఇనిస్టిట్యూట్‌లోని బేస్‌మెంట్‌లకి వరదలు వచ్చినట్టు పోలీసులకు సమాచారం అందింది. అనంతరం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. లోపల చిక్కుకున్న విద్యార్థులను సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే పలువురు విద్యార్థులు గల్లంతయ్యారు. సహాయక చర్యలు ప్రారంభించిన తర్వాత ఇద్దరు విద్యార్థినుల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. భారీ వర్షం కారణంగా వరదలు వచ్చాయని వెంటనే సహాయక చర్యలు చేపట్టామని ఢిల్లీ మంత్రి అతిశీ తెలిపారు. స్థానిక ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ కోచింగ్ సెంటర్‌కు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఘటనకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Tags:    

Similar News