Akhilesh : ప్రధాని కావాలని సీఎం యోగి భావించారు : అఖిలేష్ యాదవ్
దిశ, నేషనల్ బ్యూరో : ‘‘బంగ్లాదేశ్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ చూశారు. ఆ తప్పు మన దేశంలో జరగకూడదు’’ అంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు.
దిశ, నేషనల్ బ్యూరో : ‘‘బంగ్లాదేశ్లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరూ చూశారు. ఆ తప్పు మన దేశంలో జరగకూడదు’’ అంటూ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ‘‘యోగి ఆదిత్యనాథ్కు ప్రధానమంత్రి కావాలని ఉంది. కానీ కాలేకపోయారు. అందుకే కేంద్ర ప్రభుత్వం పరిధిలోని అంశాలపై మాట్లాడుతున్నారు’’ అని ఆయన విమర్శించారు. ప్రధానమంత్రి హోదాలో ఉన్నవారు తీసుకోవాల్సిన నిర్ణయాలపై, రాష్ట్ర సీఎం వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
‘‘గతంలోనూ చాలాసార్లు సీఎం యోగి ఇలాంటి కామెంట్స్ చేశారు. ఢిల్లీ పెద్దలు స్పందించి దీని గురించి యోగికి హితబోధ చేస్తారని నేను ఆశిస్తున్నా’’ అని అఖిలేష్ పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన పార్టీలన్నీ కులగణనకు మద్దతుగా ముందుకు వస్తున్నాయన్నారు. తప్పకుండా బీజేపీ కూడా కులగణనకు మద్దతు ప్రకటిస్తుందని సమాజ్వాదీ చీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు.