Omar Abdullah : మా మేనిఫెస్టోలో అమిత్‌షా చదివింది ఒక్క పేరానే : ఒమర్ అబ్దుల్లా

దిశ, నేషనల్ బ్యూరో : తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు.

Update: 2024-08-25 12:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో : తమ పార్టీ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోపై అభ్యంతరం తెలుపుతూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా స్పందించారు. నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ మేనిఫెస్టోలోని ఒకే ఒక పేరాగ్రాఫ్‌లో ఉన్న అంశాల ప్రాతిపదికన అమిత్‌షా విమర్శలు గుప్పిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజలంతా తమ పార్టీ మేనిఫెస్టోను చదివారు అనేందుకు కేంద్ర హోం మంత్రి వ్యాఖ్యలే నిదర్శనమన్నారు.

‘‘మా ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడినందుకు హోంమంత్రికి నా ధన్యవాదాలు. ఆయన వల్ల ప్రతి ఒక్కరూ మా మేనిఫెస్టోను నిశితంగా చదివారు. విచారకరమైన అంశం ఏమిటంటే మా మేనిఫెస్టోలోని ఒక్క పేరాగ్రాఫ్ గురించి మాత్రమే అమిత్‌షా మాట్లాడారు’’ అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘‘జమ్మూకశ్మీర్‌కు చెందిన జమాతే ఇస్లామీ పార్టీపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది. అయినా ఆ పార్టీ ఎన్నికలలో పోటీ చేసేందుకు రెడీ అవుతోంది. ప్రజాస్వామ్యంలో అందరికీ పోటీ చేసే అవకాశమివ్వాలి’’ అని ఆయన కోరారు.


Similar News