ECI : బీజేపీకి ఈసీ నోటీసు.. ప్రచార వీడియోలో బాలుడిని చూపించిన పర్యవసానం

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

Update: 2024-08-28 18:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో : త్వరలోనే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ తరుణంలో హర్యానా బీజేపీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. బీజేపీ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ఒక వీడియోలో మైనర్ బాలుడిని చూపించడాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది.

ఎన్నికల ప్రచారంలో ఈసీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నిస్తూ రాష్ట్ర బీజేపీకి బుధవారం షోకాజ్ నోటీసు పంపింది. హర్యానా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ నుంచి ఈ నోటీసు జారీ అయింది. ఆగస్టు 29న (గురువారం) సాయంత్రం 6 గంటల్లోగా వివరణను సమర్పించాలని ఆయన ఆదేశించారు.


Similar News