అబద్ధం చెప్పిన రక్షణ మంత్రి క్షమాపణ చెప్పాలి: ఎంపీ రాహుల్ గాంధీ

పార్లమెంట్‌లో అబద్ధం చెప్పిన రక్షణ మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు.

Update: 2024-07-03 14:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్‌లో అబద్ధం చెప్పిన రక్షణ మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేశారు. మంత్రి రాజ్ నాథ్ సింగ్ పార్లమెంట్ లో మాట్లాడుతూ.. అమరవీరుడు అగ్నివీర్ కుటుంబానికి సహాయం అందుతుందని చెప్పుకొచ్చారు. దీనిపై బుధవారం రాత్రి ట్విట్టర్ లో ఓ వీడియోను రాహుల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోకు క్యాప్షన్ గా రాహుల్ ఇలా రాసుకొచ్చారు. ప్రతి మతానికి ఆధారం సత్య రక్షణ.. అయితే అమరవీరుడు అగ్నివీర్ కుటుంబానికి సహాయం అందుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంటులో అబద్ధం చెప్పారు. అమరవీరుడు అగ్నివీర్‌ అజయ్‌సింగ్‌ అబద్ధాలపై ఆయన తండ్రి స్వయంగా నిజాలు చెప్పారు. రక్షణ మంత్రి పార్లమెంటుకు, దేశానికి, సైన్యానికి, అమరవీరుడు అజయ్ సింగ్ కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని రాసుకొచ్చారు.


Similar News